తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి కానిస్టేబుల్ అభ్యర్థులకు ఆగస్టు 21న నిర్వహించాల్సిన ప్రిలిమినరీ రాత పరీక్ష వాయిదా పడినట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) సోమవారం వెల్లడించింది. 15,644 పోలీస్ కానిస్టేబుల్, 63 ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, 614 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఖాళీలకై ఆగస్టు 21న నిర్వహించాల్సిన ప్రిలిమినరీ రాత పరీక్షను ఆగస్టు 28, 2022 (ఆదివారం) ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్టు టీఎస్ఎల్పీఆర్బీ ప్రకటించింది. వారి అసోసియేట్లు ఎదుర్కొంటున్న లాజిస్టిక్స్ మరియు ఇతర అడ్మినిస్ట్రేటివ్ సమస్యల కారణంగా, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించడం 7 రోజుల ఆలస్యంతో రీషెడ్యూల్ చేయబడిందని తెలిపారు.
ఇక కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు 18 నుంచి https://www.tslprb.in/ వెబ్ సైట్ లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అలాగే హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన మరిన్ని వివరాలు నిర్ణీత సమయంలో తెలియజేయబడతాయని పేర్కొన్నారు. మరోవైపు ఆగస్టు 7, ఆదివారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY