భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి పూర్వం వలస పాలనలో వందలాది మందిపై అభియోగాలు మోపేందుకు ఏర్పాటైన దేశద్రోహ చట్టంపై సుప్రీంకోర్ట్ ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తన సమీక్షను పూర్తి చేసే వరకు దేశద్రోహ చట్టంపై ‘స్టే’ విధించింది. దీంతో ఇప్పటికే దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించవచ్చు. దీనిపై విచారణ సందర్భంగా దేశద్రోహ నేరం కింద విధించిన అభియోగాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న అన్ని కేసులు, అప్పీళ్లు మరియు ప్రొసీడింగ్లను ఉపసంహరించుకోవాలి అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
తాజాగా ఏవైనా కేసులు నమోదైతే, అభియోగాలు మోపబడిన వారు కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. అలాగే తదుపరి పునర్విచారణ ముగిసే వరకు దేశద్రోహ అభియోగాలను ప్రేరేపిస్తూ ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉండాలని సుప్రీంకోర్టు బుధవారం కేంద్రం మరియు రాష్ట్రాలను కోరింది. విచారణ సందర్భంగా, దేశద్రోహ నేరానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ల నమోదును పర్యవేక్షించడానికి పోలీసు సూపరింటెండెంట్ ర్యాంక్ అధికారి బాధ్యత వహించవచ్చని కేంద్రానికి సూచించింది. కేంద్రం తరఫున హాజరైన ఎస్జి తుషార్ మెహతా, పెండింగ్లో ఉన్న దేశద్రోహ కేసులకు సంబంధించినంత వరకు, ప్రతి కేసులో బహుశా టెర్రర్ కోణం లేదా మనీలాండరింగ్ ఉండవచ్చు అని సుప్రీంకోర్టుకి చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ