సుశాంత్ సింగ్ పై విష ప్రయోగం? ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన‌ వ్యాఖ్యలు

BJP MP Subramanian Swamy, MP Subramanian Swamy, Subramanian Swamy, Sushant Singh Case, Sushant Singh Death Case, sushant singh rajput, Sushant Singh Rajput Case, Sushant Singh Rajput Death Case, Sushant Singh Rajput Suicide Case

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా సుశాంత్‌ మృతిపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సుశాంత్‌ కేసుకు సంబంధించి బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన‌ వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌పై విషప్రయోగం జరిగిందని, ఈ విషయం తెలియకుండా ఉండేలా శవపరీక్షను కావాలనే ఆలస్యంగా నిర్వహించినట్టు ఆయన ట్విట్టర్ లో ఆరోపించారు.

“హంతకుల యొక్క క్రూర మనస్తత్వం మరియు వారి ప్రమేయం నెమ్మదిగా వెల్లడవుతోంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ కడుపులోని విష ఆనవాళ్లు జీర్ణ ద్రవాలచే గుర్తించబడకుండా కరిగిపోతాయనే ఉద్దేశంతోనే శవపరీక్ష కావాలనే ఆలస్యంగా చేయబడింది. ఇందుకు బాధ్యులైన వారిని శిక్షించాలి” అని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. మరోవైపు సుశాంత్ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ముంబయిలో కీలక ఆధారాలను సేకరిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + two =