తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 24, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,670 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ లో పేర్కొంది. సోమవారం నాడు కొత్తగా 2579 కేసులు నమోదవగా, 52,933 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 9 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 770 కి పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 84,163 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 23,737 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 77.44 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.70 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2579):
- జీహెచ్ఎంసీ – 295
- రంగారెడ్డి – 186
- ఖమ్మం – 161
- వరంగల్ అర్బన్ – 143
- నిజమాబాద్ – 142
- నల్గొండ – 129
- కరీంనగర్ - 116
- మేడ్చల్ – 106
- మంచిర్యాల – 104
- జగిత్యాల – 98
- సిద్దిపేట – 92
- పెద్దపల్లి – 85
- భద్రాద్రి కొత్తగూడెం – 83
- మహబూబాబాద్ – 81
- సూర్యాపేట – 78
- మహబూబ్నగర్ – 69
- కామారెడ్డి – 64
- రాజన్న సిరిసిల్ల – 59
- వనపర్తి – 56
- నాగర్కర్నూల్ – 48
- జోగుళాంబ గద్వాల్ – 47
- జనగామ – 46
- యాదాద్రి భువనగిరి – 46
- మెదక్ - 42
- ఆదిలాబాద్ - 34
- వరంగల్ రూరల్ – 31
- సంగారెడ్డి – 30
- నిర్మల్ – 28
- వికారాబాద్ - 23
- నారాయణ్ పేట్ – 19
- ములుగు – 16
- జయశంకర్ భూపాలపల్లి – 12
- ఆసిఫాబాద్ – 10
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu