బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో ఓవైపు సీబీఐ కీలక దర్యాప్తు జరుపుతుండగా, మరోవైపు ఈ కేసులో డ్రగ్స్ కోణంపై నార్కొటిక్స్ కంట్రోల్బ్యూరో (ఎన్సీబీ) కూడా దర్యాప్తు జరుపుతుంది. అందులో భాగంగా సుశాంత్ సన్నిహితురాలు, నటి రియా చక్రవర్తిని గత మూడురోజులుగా ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా కీలక ఆధారాలు సేకరించిన నేపథ్యంలో రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు ఈ రోజు అరెస్ట్ చేశారు. సాయంత్రం రియా చక్రవర్తికి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నట్టు సమాచారం.
ఈ కేసుకు సంబంధించి రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ తో పాటుగా మరో ఇద్దరినీ ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తదుపరి విచారణ కోసం రియాతో సహా అరెస్ట్ చేసిన నలుగురినీ రిమాండ్లో ఉంచాలని ఎన్సీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు డ్రగ్స్ అంశంపై విచారణలో 25 మంది బాలీవుడ్ ప్రముఖులు పేర్లు కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. వారికీ త్వరలోనే ఎన్సీబీ అధికారులు సమాన్లు జారీ చేయనున్నట్లు సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu