తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపులో భాగంగా రాష్ట్ర మంత్రులు, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు అంబులెన్స్ వాహనాలు అందించేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించి అంబులెన్స్ వాహనాలను ప్రారంభించారు. కాగా ఈ రోజు ప్రగతి భవన్ లో మరో తొమ్మిది అంబులెన్స్ లను మంత్రి కేటిఆర్ ప్రారంభించారు. మొత్తం 9 అంబులెన్స్లను తెలంగాణ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చినందుకు మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, మల్లా రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఎంపీ ఎం శ్రీనివాస్ రెడ్డి, వేమిరెడ్డి నర్సింహరెడ్డిలకు మంత్రి కేటిఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
అలాగే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అంబులెన్స్ కొనుగోలు కోసం 20.50 లక్షల రూపాయల చెక్కును మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మంత్రి కేటిఆర్ కు అందజేశారు. అదేవిధంగా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కూడా అంబులెన్స్ కొనుగోలు కోసం 20.50 లక్షల రూపాయల చెక్కును మంత్రి కేటిఆర్ కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ ఎమ్మెల్యేలను అభినందించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu