సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌‌‌ది ఆత్మహత్యే, ఎయిమ్స్ బృందం నివేదిక

sushant singh rajput, Sushant Singh Rajput Case, sushant singh rajput case latest news, Sushant Singh Rajput Case News, Sushant Singh Rajput Death Case, Sushant Singh Rajput Death Case Investigation, Sushant Singh Rajput Death Case Investigation By CBI, Sushant Singh Rajput Death Case Is Being Investigated With All Aspects, Sushant Singh Rajput Death Case Updates

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ మృతిపై దేశంలో పలువురు అనుమానాలు లేవనెత్తిన సంగతి తెలిసిందే. సుశాంత్ మృతి కేసుపై ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా నేతృత్వంలోని వైద్యుల బృందం తమ నివేదికలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ది హత్య కాదని, ఆత్యహత్యేనని నిర్ధరించినట్టు తెలుస్తుంది. సీబీఐ కోరిన నేపథ్యంలో సుశాంత్ పోస్ట్‌మార్టం రిపోర్టును ఎయిమ్స్ వైద్యుల బృందం పూర్తిస్థాయిలో పరీక్షించి నివేదిక అందజేసింది. సుశాంత్ ది ఆత్మహత్యే అని, హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తుంది.

ఎయిమ్స్ బృందం నివేదిక అందజేసి మెడికో లీగల్ అభిప్రాయం వెల్లడించిందని ఎయిమ్స్ వర్గాలు పేర్కొన్నాయి. సీబీఐ వారి దర్యాప్తుతో ఈ నివేదికను ధ్రువీకరించుకునే అవకాశం ఉంది. మరోవైపు సుశాంత్ సింగ్ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నామని, వివిధ కోణాల్లో పరిశీలన జరుగుతుందని ఇటీవలే సీబీఐ పేర్కొంది. ఇంతవరకు ఈ కేసులో ఏ కోణాన్ని, ఏ ఆరోపణనను తోసిపుచ్చలేదని, పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని గత సోమవారం సీబీఐ వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − eight =