టీ20 ప్రపంచ కప్-2022 అక్టోబర్ 16 నుండి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా దేశంలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం నాడు విడుదల చేసింది. సూపర్ 12 రౌండ్ లో గ్రూప్-1 లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉండగా, గ్రూప్-2 లో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. దీంతో ఒకే గ్రూపులో (గ్రూప్-2) ఉన్న భారత్, పాకిస్తాన్ అక్టోబర్ 23న తలపడనున్నాయి. మెల్ బోర్న్ ఏంసీజీ స్టేడియంలో అక్టోబర్ 23న మరోసారి దాయాదుల మధ్య పోరు జరగనుంది. అలాగే ఈ టోర్నీలో భారత్ తొలిమ్యాచ్ లోనే పాకిస్తాన్ తో ఆడనుంది.
మరోవైపు టీ20 ప్రపంచ కప్-2022 తోలి సెమీ ఫైనల్ సిడ్నీలో నవంబర్ 9న, రెండవ సెమీ ఫైనల్ అడిలైడ్ లో నవంబర్ 10న జరుగనుంది. అలాగే మెల్ బోర్న్ వేదికగా ఫైనల్ నవంబర్ 13, ఆదివారం నాడు జరుగనుంది. కాగా ఈ టోర్నమెంట్ మొత్తం ఆస్ట్రేలియాలోని కార్డినియా పార్క్, బెల్లెరివ్ ఓవల్, ది గబ్బా, పెర్త్ స్టేడియం, అడిలైడ్ ఓవల్, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వంటి ఏడు స్టేడియాల్లోనే జరగనుంది.
The fixtures for the ICC Men’s #T20WorldCup 2022 are here!
All the big time match-ups and how to register for tickets 👇
— ICC (@ICC) January 20, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF