దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 3,47,2543 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,85,66,027 కు చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 703 మంది మరణించడంతో మరణాల సంఖ్య 4,88,396 కి పెరిగింది. ప్రస్తుతం 20,18,825 (5.23%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇక గత 24 గంటల్లో కర్ణాటక (47754), కేరళ (46369), మహారాష్ట్ర (45932), తమిళనాడు (28561), గుజరాత్ (24485), ఉత్తర్ ప్రదేశ్ (18429), రాజస్థాన్ (14079), ఆంధ్రప్రదేశ్ (12615), ఢిల్లీ (12306), వెస్ట్ బెంగాల్ (10959) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. దేశంలో మరో 2,51,777 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 3,60,58,806 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 93.50 శాతంగానూ, మరణాల రేటు 1.27 శాతంగా ఉంది. మరోవైపు దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,692 కు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF