తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం హాస్పిటల్లో చేరారు. అయితే సీఎం స్టాలిన్కు జూలై 12వ తేదీన కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో ఇంట్లోనే ఐసొలేషన్ అయిన ఆయన , ఆరోగ్యం కుదుటపడక పోవడంతో ఈరోజు చెన్నైలోని అళ్వార్పేట్లో ఉన్న కావేరి హాస్పిటల్లో చేరారు. కోవిడ్ సంబంధిత లక్షణాలు ఉన్న కారణంగా సీఎం స్టాలిన్ హాస్పిటల్లో చేరారని సీఎంఓ అధికారులు ప్రకటించారు. కాగా ఆయనకు పరీక్షలు నిర్వహిస్తున్నామని, అబ్జర్వేషన్లో ఉంచామని హాస్పిటల్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, వాక్సినేషన్ చేయించుకోవాలని సీఎం స్టాలిన్ ప్రజలకు సూచించారు. సీఎం స్టాలిన్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం, పుదుచ్చేరి సీఎం రంగస్వామి ఆకాంక్షించారు. మరోవైపు పీఎంకే చీఫ్ డాక్టర్ రామదాస్ కూడా నిన్న పాజిటివ్ అని తేలడంతో ఆయన కూడా ఐసోలేషన్లో ఉన్నారు. తమిళనాడులో రోజువారీ కోవిడ్ సంఖ్య 2,000కి చేరుకుంది. నిన్న రాష్ట్రంలో 2,269 కేసులు నమోదయ్యాయి, చెన్నైలో అత్యధికంగా 729 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 18,282 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ