తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం నాడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ప్రధానితో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను స్టాలిన్ చర్చించారు. అలాగే శ్రీలంక దేశంలో నెలకున్న ఆర్థిక సంక్షోభ పరిస్థితిపై చర్చించినట్టు తెలుస్తుంది. తమిళనాడు నుండి ఆహారం మరియు మందులతో సహా ఇతర సహాయ సామగ్రిని శ్రీలంకకు పంపేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రధాని మోదీకి ప్రతిపాదించినట్టు సమాచారం.
ఈ పర్యటనలో భాగంగా సీఎం స్టాలిన్ మూడు రోజుల పాటుగా ఢిల్లీలో ఉండి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర రాజకీయ నేతలను కలుసుకోనున్నారు. కేంద్రం నుంచి వరద సాయం, రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా, పలు ప్రాజెక్టులకు నిధులు అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. మరోవైపు ఏప్రిల్ 2న ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్లో కొత్తగా నిర్మించిన డీఎంకే పార్టీ కార్యాలయాన్ని సీఎం స్టాలిన్ ప్రారంభించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ