దేశంలో తాజాగా విధించిన లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా బార్బర్/సెలూన్ షాపులకు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే పలు నగరాల్లో సెలూన్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హెయిర్కట్ కోసం సెలూన్లుకు వచ్చే వారికి ఆధార్ కార్డు తప్పినిసరి చేసింది. హెయిర్కట్ చేయించుకోవాలంటే మాస్క్తో పాటుగా ఆధార్ కార్డు జిరాక్స్ వెంట తెచ్చుకోవాలని ప్రభుత్వం కొత్తగా నిబంధన విధించింది.
సెలూన్లకు వచ్చే కస్టమర్ల వివరాలను యజమానులు సేకరించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. పేరు, చిరునామా, ఫోన్ నంబర్ తో పాటుగా ఆధార్ కార్డును తనిఖీ చేసి, ఆధార్ నంబర్ సహా వివరాలను రిజిస్టర్ లో నమోదు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించకుంటే షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు ప్రభుత్వం హెచ్చరించింది.సెలూన్ల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఆయా షాపులకు వచ్చిన వారిని ఈ విధానం ద్వారా గుర్తించడం అధికారులకు మరింత సులభం అవుతుందని భావిస్తున్న నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
మరోవైపు దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతుంది. జూన్ 2 నాటికే రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 24,586 కి చేరింది. ఈ వైరస్ వలన మరణించిన వారి సంఖ్య 197 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 536 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 13,706 కి చేరింది. ప్రస్తుతం 10,680 మంది వివిధ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu