హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఉస్మానియా వైద్య కళాశాలలో కూడా 12 మంది విద్యార్థులకు కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ వెల్లడించారు.
ఇటీవలే ఉస్మానియా వైద్య కళాశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు వార్తలు వచ్చాయి. లాక్డౌన్ నేపథ్యంలో విద్యార్థులంతా వసతి గృహంలోనే ఉండి పరీక్షలకు సిద్దమవుతున్న క్రమంలో కళాశాల యాజమాన్యం అప్రమత్తమై మొత్తం 296 మంది విద్యార్థిని, విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయించారు. ఇప్పటివరకు 12 మందికి కరోనా నిర్ధారణ కాగా, మరి కొంతమంది ఫలితాలు రేపు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu