దేశంలో హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్, 45 ఏళ్లు పైబడినవారితో పాటుగా, మే 1 నుంచి 18-44 ఏళ్ల వారికి కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి డోసు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియజేస్తూ మీరంతా దయచేసి వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్ వేయించుకుని, సురక్షితంగా ఉండండని పేర్కొన్నారు. మరోవైపు భారత్ జట్టు ఆటగాళ్లు శిఖర్ ధావన్, అజింక్య రహానె, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ కూడా ఇప్పటికే మొదటి డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ