టీ20 ప్రపంచ కప్-2021 అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు యూఏఈ మరియు ఒమన్లలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాడు టీ20 ప్రపంచకప్ లో పాల్గొనే టీమిండియా జట్టును భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ కోసం అఖిల భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ 15 మంది ఆటగాళ్లతో కూడిన టీమిండియా జట్టును ఎంపిక చేసినట్టు బీసీసీఐ తెలిపింది. ఈ జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా, రోహిత్ శర్మ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు.
కాగా టీ20 ప్రపంచకప్ కోసం జట్టుకు మార్గనిర్దేశం చేయడానికి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని మెంటార్గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఇటీవలే టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ను కూడా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసింది. ఈ ఐసీసీ టోర్నమెంట్ కోసం అన్ని క్రికెట్ బోర్డులు వరుసగా ఎంపిక చేసిన ఆటగాళ్ల జాబితాను ప్రకటిస్తున్నాయి.
టీ20 ప్రపంచకప్ కోసం భారత్ జట్టు : విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
- స్టాండ్ బై ప్లేయర్లు: శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్
- మెంటార్ : మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ