రాజ్యసభ ఎంపీగా తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె లక్ష్మణ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు, మాజీ ఎంపీలు, తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు అభినందించారు. కాగా లక్ష్మణ్ ను బీజేపీ అధిష్ఠానం ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక చేసింది. అనంతరం ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. తనను రాజ్యసభకు ఎంపిక చేసిన జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజల సమస్యలను చట్టసభలో ప్రస్తావించడానికి యూపీ నుంచి తనను రాజ్యసభకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ నుంచి ఎంపిక చేసినందున తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి తన వంతు కృషి చేస్తానని లక్ష్మణ్ హామీ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ