వచ్చే నెల 2, 3వ తేదీల్లో హైదరాబాద్ హెచ్ఐసీసీలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా రాష్ట్ర పోలీసుశాఖ భారీ భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని మోదీతో పాటు 40 మంది వరకు కేంద్ర స్థాయి నేతలు పాల్గొననున్నారు. హోంమంత్రి అమిత్షా, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్తోపాటు ఇతర కేంద్ర మంత్రులు, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల పార్టీ ప్రముఖులు హాజరవుతున్నారు. వందల మంది పార్టీ నాయకులు ఆ రెండు రోజులపాటు నగరంలో బస చేయనుండటంతో వారి భద్రత దృష్ట్యా అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రధాని మోదీ జూలై 2న ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) ఆవరణలో దిగుతారు. అనంతరం రోడ్డు మార్గంలో గచ్చిబలిలోని ఐఎస్బీకి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి పొరపాటుకూ తావివ్వకుండా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయడంలో తెలంగాణ పోలీసు శాఖ నిమగ్నమైంది. ఐఎస్బీఐతో పాటు బేగంపేట విమానాశ్రయం, హెచ్ఐసీయూలలో భారీ ఎత్తున పోలీసులను మోహరిస్తున్నారు. ఒక్క ఐఎస్బీలోనే 2వేల మంది వరకు పోలీసులను వినియోగిస్తున్నారు. సైబరాబాద్ ఇన్చార్జి కమిషనర్ సీవీ ఆనంద్ ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ