ఆసియాలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ను అంతర్జాతీయంగా విస్తరించేందుకు అంబానీ సింగపూర్లో ఫ్యామిలీ ఆఫీస్ను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే సిబ్బందిని మరియు మేనేజర్ని కూడా నియమించుకున్నట్లు సమాచారం. కాగా మరో ఏడాదిలో అంబానీ సంస్థ కార్యకలాపాలు సింగపూర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని, దీనిని ఆయన భార్య నీతా అంబానీ పర్యవేక్షిస్తారని రిలయన్స్ వర్గాలు తెలిపాయి. భారతదేశం వెలుపల రిటైల్-టు-రిఫైనింగ్ వ్యాపారాన్ని విస్తరించడానికి మరియు అక్కడి ఆస్తులను కొనుగోలు చేయడానికి ముఖేష్ అంబానీ దీర్ఘకాలిక ప్రణాళికలు వేస్తున్నట్లు వారు వెల్లడించారు.
తక్కువ పన్నులు మరియు సురక్షితమైన భద్రత కారణంగా సింగపూర్ ఎప్పటినుంచో అంతర్జాతీయ కార్యాలయాలకు ఆకర్షణీయమైన కేంద్రంగా ఉంటోంది. మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ గణాంకాల ప్రకారం 2021 చివరి నాటికి ప్రపంచంలోని అగ్రశ్రేణి వ్యాపార దిగ్గజ కంపెనీలలో ఇలా ఆఫీసులు ప్రారంభించిన ధనవంతుల సంఖ్య 700కి చేరుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక సింగపూర్లోకి సంపన్న విదేశీయుల రాక పెరుగుతుండడం వల్ల గృహాలు, వాహనాలు మరియు ఇతర ఉత్పత్తుల ధర కూడా పెరుగుతోందని, ఇది దేశాభివృధికి దోహదపడుతుందని సింగపూర్ ఉప ప్రధాన మంత్రి లారెన్స్ వాంగ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY