ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ఐఎన్ఎస్ రణవీర్ యుద్ధనౌకలో భారీ పేలుడు సంభవించింది. భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ రణవీర్ లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భారత నౌకాదళ సిబ్బంది మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారని నేవీ అధికారులు తెలిపారు. వీరికి నౌకాదళ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంగళవారం సాయంత్రం సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో నౌక ముంబై డాక్యార్డ్లో ఉంది. నౌకలోని ఒక కంపార్టుమెంట్ లోపల ఈ పేలుడు జరిగినట్లు నౌకాదళ సిబ్బంది తెలియజేశారు. ప్రమాదాన్ని గుర్తించిన నౌక సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చినాట్లు వారు చెప్పారు.
అయితే, ఈ పేలుడులో నౌకలోని ఆయుధ సంపత్తికి ఎటువంటి నష్టం వాటిల్లలేదని వెల్లడించారు. ప్రమాదవశాత్తు పేలుడు సంభవించినట్లు నేవీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై విచారణ కమిటీని నియమించారు. తూర్పు నౌక దళానికి చెందిన ఐఎన్ఎస్ రణవీర్ విశాఖపట్నం కేంద్రంగా విధులు నిర్వహిస్తోంది. రెగ్యులర్ గా జరిగే క్రాస్ కోస్ట్ విధుల్లో భాగంగా గత నవంబర్ నుంచి పశ్చిమ తీరంలో విధులు నిర్వహిస్తోంది. రష్యాలో నిర్మితమైన ఈ యుద్ధనౌక 1986 అక్టోబర్ 28 న భారత నౌకాదళంలో చేరింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF