తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వరుసగా పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీ నేత, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను మరియు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. ఇటీవల నన్ను కలిసిన వారంతా వీలైనంత త్వరగా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను. దయచేసి సురక్షితంగా ఉండండి మరియు జాగ్రత్త వహించండి” అని గండ్ర వెంకటరమణా రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన భార్య, జెడ్పి చైర్ పర్సన్ జ్యోతికి కూడా కరోనా పాజిటివ్ గా తేలినట్టు తెలుస్తుంది.
కాగా మంగళవారం నాడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంట నష్టంపై పరిశీలన కోసం పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో మంత్రులతో పాటుగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి హెలికాప్టర్లో ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎమ్మెల్యేకు జ్వరం రావడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
I’ve tested positive for COVID with mild symptoms. I have quarantined myself at home and taking all the necessary precautions.
I would request those who came in contact with me to get themselves tested at the earliest. Please be safe and take care.@KTRTRS @trsharish
— Gandra Venkataramana Reddy (@Gandraofficial) January 19, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF