టోక్యో ఒలింపిక్స్-2020లో భారత రెజ్లింగ్ క్రీడాకారుల అద్భుత ప్రదర్శన కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం జరిగిన పోటీల్లో భారత్ రెజ్లర్ భజరంగ్ పూనియా సంచలన విజయాలతో సెమీస్ కు దూసుకెళ్లాడు. ఒలింపిక్ పతకం సాధించేందుకు కేవలం ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. ముందుగా ఒలింపిక్స్ పురుషుల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో ఓపెనింగ్ రౌండ్ లో భజరంగ్ పూనియా కిర్గిస్తాన్ చెందిన ఎర్నజార్ అక్మతలైవ్ పై 3-3 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాడు.
అనంతరం క్వార్టర్ ఫైనల్ లో ఇరాన్ కు చెందిన మొరైజా గయాసిపై భజరంగ్ పూనియా పిన్ డౌన్ సహాయంతో 2-1 తేడాతో విజయం సాధించి సెమీస్ కు చేరుకున్నాడు. క్వార్టర్స్ మొదటి పీరియడ్ లో 0-1 తో వెనుకబడ్డప్పటికీ, తర్వాత పూర్తి ఆధిపత్యం చూపించిన భజరంగ్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 5 నిమిషాలలోపే పోటీని ముగించాడు. ఇక శుక్రవారం మధ్యాహ్నం 2:50 గంటలకు జరగనున్న సెమీఫైనల్లో అజర్ బైజాన్ కు చెందిన హజి అలియెవ్ తో భజరంగ్ పూనియా తలపడనున్నాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ