ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 11, శుక్రవారం కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ముందుగా శుక్రవారం ఉదయం బెంగుళూరులోని విధాన సౌధలో సెయింట్ పోయెట్ శ్రీ కనక దాసు మరియు మహర్షి వాల్మీకి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో చెన్నై-మైసూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును మరియు భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
చెన్నై-మైసూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ కనెక్టివిటీని, వాణిజ్య కార్యకలాపాలను పెంచుతుందని ప్రధాని అన్నారు. ఇది ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ను కూడా మెరుగుపరుస్తుందని, బెంగళూరు నుండి ఈ రైలును ప్రారంభించినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. అలాగే భారత్ గౌరవ్ కాశీ యాత్ర రైలును చేపట్టిన మొదటి రాష్ట్రంగా నిలిచిన కర్ణాటక రాష్ట్రాన్ని అభినందిస్తున్నాను అని ప్రధాని పేర్కొన్నారు. ఈ రైలు కాశీ మరియు కర్ణాటకలను దగ్గర చేస్తుందని, యాత్రికులు మరియు పర్యాటకులు కాశీ, అయోధ్య మరియు ప్రయాగ్రాజ్లను సులభంగా సందర్శించగలరని పేర్కొన్నారు.
అనంతరం బెంగుళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు రూ.5000 కోట్ల వ్యయంతో నిర్మించిన టెర్మినల్-2ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ టెర్మినల్-2ను బెంగుళూరు గార్డెన్ సిటీకి నివాళిగా రూపొందించారు మరియు ప్రయాణీకులకు గార్డెన్లో నడిచినట్టుగా అనుభవం కలిగేలా ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు 10,000 కుపైగా చదరపు మీటర్ల గ్రీన్ వాల్స్, హ్యాంగింగ్ గార్డెన్స్, అవుట్ డోర్ గార్డెన్స్ గుండా ప్రయాణిస్తారన్నారని చెప్పారు. అలాగే కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ టెర్మినల్-2 వలన ప్రయాణీకుల నిర్వహణ సామర్ధ్యం సంవత్సరానికి ప్రస్తుత 2.5 కోట్ల నుండి.5-6 కోట్ల వరకు పెరగనుందని పేర్కొన్నారు. ఇక మధ్యాహ్నం సమయంలో 108 అడుగుల నాడప్రభు కెంపేగౌడ కాంస్య విగ్రహాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించనున్నారు. అనంతరం బెంగళూరులో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE