ట్విట్టర్ సీఈఓ ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ సంస్థను కైవసం చేసుకున్నప్పటినుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన ఈసారి ఏకంగా ట్విట్టర్ ఐకానిక్ బ్లూ బర్డ్ లోగోను మార్చేసారు. దీని స్థానంలో ప్రముఖ క్రిప్టోకరెన్సీ డోజీకాయిన్ కు సంబంధించిన డోజీ మీమ్ను ఉంచారు. మంగళవారం ఉదయం ట్విట్టర్ యూజర్లకు ఈ కొత్త లోగో దర్శనమిచ్చింది. కానీ ఇది డెస్క్ టాప్ వెర్షన్లో మాత్రమే కనిపిస్తోంది. అయితే ట్విట్టర్ మొబైల్ యాప్లో ఎలాంటి మార్పు లేదు. కాగా దీనిపై ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ట్విట్టర్ ఈ లోగోను మార్చేసింది. ఇక ట్విట్టర్ లోగో మారిందంటూ యూజర్లు ఎలోన్ మస్క్ దృష్టికి తీసుకురాగా, దీనిపై ఆయన స్పందించారు.
As promised pic.twitter.com/Jc1TnAqxAV
— Elon Musk (@elonmusk) April 3, 2023
ట్విట్టర్ లోగోను మార్చేసినట్లు ధ్రువీకరించిన ఆయన.. బ్లూ బర్డ్ పాతబడి పోయిందని, అందుకే ఇకపై డోజీ మీమ్ ట్విట్టర్కు కొత్త లోగో అని వెల్లడించారు. ఈ మేరకు ఫన్నీ మీమ్ను షేర్ చేసిన మస్క్, దీంతో పాటు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానంటూ మరో ట్వీట్ కూడా చేశారు. దీనిప్రకారం.. 2022 మార్చి 26న ఒక నెటిజన్ ట్విట్టర్ను కొనుగోలు చేసి, బర్డ్ లోగోను డోజీతో రీప్లేస్ చేయమని మస్క్ కు సూచించాడు. నెటిజెన్ సూచనకు ఓకే అని చెప్పిన మస్క్.. తాజాగా ఈ చాటింగ్కు సంబంధించిన స్క్రీన్షాట్ షేర్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE