నేడు పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి సీఎం జగన్ పోలవరం పర్యటనకు వచ్చారు. వీరితోపాటు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు పేట చేరుకున్న కేంద్రమంత్రి షెకావత్, సీఎం వైఎస్ జగన్ లకు అధికారులు మరియు నిర్వాసితులు స్వాగతం పలికారు. అక్కడి నిర్వాసితులతో కేంద్రమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పశ్చిమగోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీలో నిర్వాసితులను షెకావత్ కలుసుకున్నారు. పునరావాస కాలనీలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన వసతులు గురించి తెలుసుకున్నారు. మరోసారి పోలవరం సందర్శనకు వస్తా అని ఈ సందర్భంగా షెకావత్ తెలిపారు.
ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్ వద్దకు చేరుకొని నిర్మాణ పనులను పరిశీలించారు. పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు పురోగతిపై స్పిల్వే వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్రమంత్రి తిలకించారు. ప్రాజెక్టులో భాగమైన చేపల నిచ్చెన పనులు, గైడ్ బండ్ పనులను మంత్రి సందర్శించారు. ఎగువ కాఫర్డ్యామ్ పనులు, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పనుల గురించి ఆరా తీశారు. స్పిల్ వే, స్పిల్ చానల్, డయా ఫ్రమ్ వాల్, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్లను వీక్షించి పీపీఏ, జలవనరుల శాఖ అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. నిర్ధేశించిన గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా షెకావత్ సూచించారు. ఈ సందర్భంగా.. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే అని గజేంద్ర సింగ్ షెకావత్ మరోసారి స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ