కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రముఖ సంస్థలన్నీ ఉద్యోగులకు “వర్క్ ఫ్రమ్ హోమ్” కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ సోషల్ మీడియా సంస్థలైన పేస్ బుక్, ట్విట్టర్ కూడా అదే బాటలో నడిచాయి. ఈ నేపథ్యంలో ట్విట్టర్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబరుకి ముందు కార్యాలయాలను తెరిచే అవకాశం లేదని, అలాగే కరోనా వైరస్ లాక్డౌన్ ముగిసిన తర్వాత కూడా తమ సంస్థలోని ఉద్యోగుల్లో చాలామందికి ఇంటి నుండి శాశ్వతంగా పని చేయడానికి అనుమతిస్తామని ట్విట్టర్ ప్రకటించింది. ఇంటి నుంచే ఉద్యోగులు సమర్ధవంతంగా పనిచేసేలా కొత్త విధానాన్ని రూపొందించినట్టు ట్విట్టర్ తెలిపింది. గూగుల్ మరియు ఫేస్బుక్ల సంస్థలలో చాలా మంది ఉద్యోగులను ఈ ఏడాది చివరి వరకు ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతించిన అనంతరం ట్విట్టర్ కూడా ఈ నిర్ణయం దిశగా అడుగులేసినట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu