ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషిద్ అల్ మాక్తొమ్ కూడా మంగళవారం నాడు కరోనా టీకా వేయించుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ, వాక్సిన్ వేయించుకుంటున్న ఫొటోను షేర్ చేశారు. “ఈ రోజు కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకున్నాను. ప్రతి ఒక్కరికీ భద్రత మరియు గొప్ప ఆరోగ్యాన్ని మేము కోరుకుంటున్నాము మరియు యూఏఈలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన మా బృందాల పట్ల మేము గర్విస్తున్నాము. యూఏఈ లో భవిష్యత్తు ఎల్లప్పుడూ మెరుగ్గా ఉంటుంది” అని ట్వీట్ చేశారు.
While receiving the COVID-19 vaccine today. We wish everyone safety and great health, and we are proud of our teams who have worked relentlessly to make the vaccine available in the UAE. The future will always be better in the UAE. pic.twitter.com/Rky5iqgfdg
— HH Sheikh Mohammed (@HHShkMohd) November 3, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ