ఆంధప్రదేశ్ రాష్ట్రంలో చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు రూపకల్పన చేసిన ‘జగనన్న తోడు’ పథకాన్ని నవంబర్ 6, శుక్రవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు బ్యాంకుల నుంచి రూ.10 వేల చొప్పున రుణాలు ఇప్పించనున్నారు. అలాగే ఈ రుణాలపై అయ్యే వడ్డీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఈ పథకంకోసం రాష్ట్రంలో ఇప్పటికే 9 లక్షల మందిని పైగా అర్హులను గుర్తించినట్టు తెలుస్తుంది. అలాగే ఈ పథకానికి ఇంకా ఎవరైనా అర్హులుగా భావిస్తే గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ