యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (73) శుక్రవారం నాడు కన్నుమూశారు. ఈ మేరకు యూఏఈ అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. షేక్ ఖలీఫా బిన్ 2004 నుండి యూఏఈ అధ్యక్షుడిగా మరియు అబుదాబి పాలకుడిగా ఉన్నారు. యూఏఈ మొదటి అధ్యక్షుడిగా వ్యవహరించిన తన తండ్రి షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ మరణాంతరం, నవంబర్ 3, 2004న యూఏఈ రెండో అధ్యక్షుడిగా షేక్ ఖలీఫా బిన్ బాధ్యతలు చేపట్టి, ఇప్పటివరకు కొనసాగారు.
యూఏఈ మరియు సంబంధిత ప్రాంతాల్లో ప్రజలు బాగా ఇష్టపడే వ్యక్తిగా అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ కు గొప్ప పేరుంది. అతని పాలనలో యూఏఈ వేగంగా అభివృద్ధి చెందిందని ప్రజలు భావిస్తారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణంతో యూఏఈలో విషాదచాయలు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా 40 రోజులు పాటు సంతాప దినాలను ప్రకటించారు. అలాగే షేక్ ఖలీఫా బిన్ మరణం పట్ల పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF