మున్సిపల్ ఉద్యోగులు రోజంతా కష్టపడినా, తగిన గుర్తింపు ఉండదు.. వారిని అందరూ గౌరవించాలి అని తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైద్రాబాద్ లోని వెంగళరావు నగర్ లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ అధికారులతో వర్క్ షాప్ నిర్వహించారు. దీనిలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 68 మున్సిపాలిటీలు మాత్రమే ఉండేవని, తర్వాత కొత్తగా మరో 74 మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రం లోని మున్సిపాలిటీల సంఖ్య 142 అని, అయితే మున్సిపల్ శాఖకు అదనపు సిబ్బందిని కేటాయించలేదని వివరించారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్నసిబ్బందితోనే పట్టణ ప్రగతి అమలు చేస్తున్నామని, త్వరలోనే మునిసిపల్ శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని మున్సిపాలిటీలల్లో మున్సిపల్ అధికారులు, సిబ్బంది అందరూ నిరంతరం కష్టపడుతుంటారని, కానీ వారిని మాత్రం ఎవరూ గుర్తించరని.. వారిని అందరూ గౌరవించాలి అని కోరారు. ఒకప్పటికంటే తెలంగాణలో 46 శాతం పట్టణీకరణ పెరిగిందని, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని సూచించారు కేటీఆర్. ఈ నెల 20వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని, అలాగే ఈ ఆర్ధిక సంవత్సరం లోనే డిజిటల్ డోర్ నంబర్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ