టోక్యో ఒలింపిక్స్-2020లో భారత రెజ్లింగ్ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. బుధవారం ఉదయం జరిగిన పోటీల్లో భారత్ రెజ్లర్లు రవికుమార్ దహియా, దీపక్ పునియా సంచలన విజయాలతో సెమీస్ కు దూసుకెళ్లారు. పతకం సాధించేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. ముందుగా ఒలింపిక్స్ పురుషుల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో రవికుమార్ దహియా కొలంబియాకు చెందిన టైగ్రరోస్ పై 13-2 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాడు, అనంతరం క్వార్టర్ ఫైనల్ లో బల్గేరియాకు చెందిన జార్జి వలెటినోవ్ పై పూర్తి ఆధిపత్యం చూపించిన రవి దహియా 14-4 తేడాతో విజయం సాధించి సెమీస్ కు చేరుకున్నాడు.
ఇక రెజ్లర్ దీపక్ పునియా పురుషుల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ 86 కేజీల విభాగంలో నైజీరియాకు చెందిన అజియోమోర్ ఎకెరెకేమినిపై 12-1 విజయంతో క్వార్టర్స్ కు చేరాడు. ఇక క్వార్టర్స్ లో చైనాకు చెందిన లిన్ జుషెన్పై 6-3 తేడాతో విజయం సాధించి సెమీస్ కు చేరాడు. రవికుమార్ దహియా, దీపక్ పునియా సెమీఫైనల్లో కూడా సత్తా చాటితే భారత్ ఖాతాలో మరో రెండో పతకాలు చేరనున్నాయి. మరోవైపు జావెలిన్ త్రోలో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా సంచలనం సృష్టించాడు. ఒకే ప్రయత్నంలో 86.65 మీటర్ల విసిరి, 1వ స్థానంలో నిలిచి నేరుగా ఫైనల్ కు అర్హత సాధించాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ