దేశంలో 116 కి చేరిన కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

UK Mutant Strain: 116 People Tested Positive Till Now in India

దేశంలో కొత్తరకం కరోనా వైరస్ (‌యూకే కరోనా స్ట్రెయిన్) పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. శనివారం నాటికి ఈ కొత్తరకం కరోనా స్ట్రెయిన్ పాజిటివ్ కేసుల సంఖ్య 116 కి చేరుకున్నట్లుగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాజిటివ్ గా తేలిన వారిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఐసొలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే వారి కాంటాక్ట్ వ్యక్తులను కూడా క్వారంటైన్ లో ఉంచామని, ఇతర నమూనాలపై కూడా వైరస్ నిర్ధారణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతోందని తెలిపారు. మరోవైపు కొత్తరకం కరోనా కేసులు యూకేతో పాటుగా ఇప్పటివరకు అమెరికా, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్ డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్ సహా మొత్తం 50 దేశాల్లో నమోదయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెఛ్ఓ) వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =