ఉక్రెయిన్‌ లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు తరలింపుపై కేంద్రం కీలక నిర్ణయం

Ukraine-Russia Conflict India Working to Establish Evacuation Routes from Romania Hungary, Ukraine-Russia Conflict India Working to Establish Evacuation Routes from Romania, Ukraine-Russia Conflict India Working to Establish Evacuation Routes from Hungary, Evacuation Routes from Romania And Hungary, Romania And Hungary, Romania, Hungary, Ukraine-Russia Conflict, Ukraine-Russia Crisis, Russia Ukraine Conflict, Russia Ukraine, Russian Ukraine crisis Live, Russian Ukraine crisis, Russia-Ukraine War Live Updates, Russia Ukraine War, Ukraine conflict, Conflict in Ukraine, Russia Ukraine conflict LIVE updates, Russia Ukraine conflict News, Russia Ukraine conflicts, Russo Ukrainian War, Ukraine Russia Conflict, Ukraine Russia War, Ukraine, Russia, Ukraine News, Ukraine Updates, Ukraine Latest News, Ukraine Live Updates, russia ukraine war news, russia ukraine war status, Russia Ukraine News Live Updates, Ukraine News Updates, War in Ukraine Updates, Russia war Ukraine, ukraine news today, ukraine russia news telugu, Mango News, Mango News Telugu,

ఉక్రెయిన్‌ పై రష్యా మిలిటరీ ఆపరేషన్ చేపడుతుండడంతో ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు, పౌరుల తరలింపుపై శుక్రవారం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హంగరీ లోని భారతీయ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. “రొమేనియా మరియు హంగరి నుండి తరలింపు మార్గాలను ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం మరియు హంగరీ భారత రాయబార కార్యాలయం పని చేస్తోంది. ప్రస్తుతం టీమ్‌లు ఉజ్హోరోడ్ సమీపంలోని చోప్-జహోనీ హంగేరియన్ సరిహద్దు, చెర్నివ్ట్సీ సమీపంలోని పోరుబ్నే-సిరెట్ రోమేనియన్ సరిహద్దుల వద్ద రంగంలో ఉన్నాయి” అని తెలిపారు.

“భారతీయ పౌరులు, ప్రత్యేకించి పైన పేర్కొన్న సరిహద్దు చెక్‌పాయింట్‌లకు దగ్గరగా నివసించే విద్యార్థులు ఈ ఎంపికను నిర్ణయించుకుని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన బృందంతో సమన్వయంతో ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ముందుగా బయలుదేరాలి. పైన పేర్కొన్న మార్గాలు పనిచేయడం మొదలైన తర్వాత, రవాణా కోసం వారి స్వంత ఏర్పాట్ల ద్వారా ప్రయాణించే భారతీయ పౌరులు ఆ సరిహద్దు చెక్‌పోస్టులకు వెళ్లాలని సూచించబడతారు. అలాగే సరిహద్దుల గుండా వెళ్లేందుకు సంబంధిత చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్‌ల తో కాంటాక్ట్ లో ఉండండి. ప్రయాణ క్రమబద్ధీకరణ కోసం విద్యార్థులు స్టూడెంట్ కాంట్రాక్టర్లతో సంప్రదింపుల్లో ఉండాలి” అని పేర్కొన్నారు.

మరోవైపు విద్యార్థులు పాస్ పోర్ట్, అత్యవసరాలకు మరియు ఇతర అవసరాలకు సరిపడా నగదు(యూఎస్ డాలర్స్), అందుబాటులో ఉంటే కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ (రెండు రోజులు) దగ్గరుంచుకోవాలని తెలిపారు. అలాగే వారు ప్రయాణించే సమయంలో భారత్ జెండాలను వాహనాలపైనా, బస్సులపైనా అంటించుకోవాలని పేర్కొన్నారు.

.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 3 =