రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న విషయం తెలిసిందే. కాగా ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో.. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులకు సహాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. న్యూఢిల్లీతో పాటుగా ఆంధ్రప్రదేశ్ సెక్రెటేరియట్ లలో హెల్ప్ లైన్ సెంటర్స్ ఏర్పాటు చేసింది. అలాగే కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుని, ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులకు/వలసదారులుకు సాధ్యమైన అన్ని విధాల మద్దతును అందించాలని ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సూచించారు.
ఢిల్లీలోని ఏపీ భవన్ హెల్ప్ లైన్ సెంటర్:
- శ్రీ పి. రవిశంకర్, OSD: 9871999055
- శ్రీ ఎంవీఎస్ రామారావు, అసిస్టెంట్ కమిషనర్: 9871990081
- శ్రీ ASRN సాయిబాబు, అసిస్టెంట్ కమిషనర్: 9871999430
- ల్యాండ్లైన్: 011-23384016
- ఇమెయిల్: [email protected]
ఆంధ్రప్రదేశ్ సెక్రెటేరియట్ హెల్ప్ లైన్ సెంటర్:
- 24/7 హెల్ప్లైన్: 0863-2340678
- WhatsApp: +91-8500027678
- ఇ-మెయిల్: [email protected] మరియు [email protected]
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ