అండర్-19 ప్రపంచకప్ 2022 టైటిల్ విజేతగా నిలిచింది టీమిండియా. సమిష్టి ప్రదర్శనతో యువ భారత్ రికార్డు స్థాయిలో ఐదోసారి అండర్-19 వన్డే క్రికెట్ ప్రపంచకప్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్తో శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో యశ్ ధుల్ నేతృత్వంలోని కుర్రాళ్ళ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 190 పరుగుల లక్ష్యాన్ని మరో 2 బంతులు మిగిలి ఉండగానే చేధించి కప్ గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాట్సమన్లలో జేమ్స్ రూ.. 116 బంతుల్లో 95 పరుగులతో ఒంటరి పోరాటం చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సాయపడ్డాడు. టెయిలెండర్ జేమ్స్ సేల్స్ (31) తో కలిసి ఎనిమిదో వికెట్కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జేమ్స్ .. 5 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు.
అనంతరం భారత్ బ్యాటింగ్లో.. నిషాంత్ సింధు 50 పరుగులతో నాటౌట్గా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక వైస్ కెప్టెన్, ఆంధ్ర కుర్రాడు.. షేక్ రషీద్ 50 పరుగులు, రాజ్ బవా 35 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడారు. బౌలింగ్ లో.. ఎడంచేతి వాటం పేస్ బౌలర్ రవి కుమార్ 4 వికెట్లతో చెలరేగాడు. రాజ్ బావా ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముందుగా బంతితో ఐదు వికెట్లు తీసిన రాజ్ బావా (5/31) ఆ తర్వాత బ్యాటింగ్లోనూ (54 బంతుల్లో 35; 2 ఫోర్లు) మెరిశాడు. అండర్ -19 వరల్డ్ కప్ లో భారత కుర్రాళ్లు మొదటి మ్యాచ్ నుంచే సత్తా చాటారు. కరేబియన్ గడ్డపై జరిగిన ఈ సిరీస్ ఆద్యంతం ఆల్ రౌండ్ షో తో ఆకట్టుకున్నారు. కాగా, అండర్–19 ప్రపంచకప్ లో భారత్ చాంపియన్గా నిలువడం ఇది ఐదోసారి. భారత్ 2000, 2008, 2012, 2018 లలోనూ విజేతగా నిలిచింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ