పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ప్రజలు ఎంతో ఆశక్తి ఎదురుచూస్తున్నా కేంద్ర బడ్జెట్ 2020-21 ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ముందుగా సంప్రదాయాన్ని అనుసరించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమై బడ్జెట్ కు ఆమోదముద్ర వేశారు. అనంతరం లోక్సభలో ఉదయం 11 గంటలకు ఆర్థికశాఖ మంత్రిగా నిర్మలాసీతారామన్ రెండోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
కేంద్ర బడ్జెట్ 2019-20 – లైవ్ అప్డేట్స్
- ఇది సామాన్యుల బడ్జెట్ అని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన
- బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది
- ప్రజల ఆదాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నాం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్
- జీఎస్టీ వలన రాష్ట్రాల, కేంద్రం ఆదాయం పెరిగింది
- ఏప్రిల్ 2020 నుంచి పన్ను చెల్లించే విధానం మరింత సరళం చేయనున్నాం
- సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ యే ఈ ప్రభుత్వ లక్ష్యం
- ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా దేశంలో అందరికీ ఇళ్లు మంజూరు
- 6 కోట్ల 11 లక్షల మంది రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు
- వ్యవసాయరంగ అభివృద్ధికి, రైతు సంక్షేమానికి 16 సూత్రాల పథకం అమలు
- మరో 26 లక్షల మందిక రైతులకు సోలార్ పంపు సెట్ల పథకం అమలు
- ప్రభుత్వం తొలి ప్రాధాన్యంగా వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి
- ద్వితీయ ప్రాధాన్యంగా ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు
- మూడో ప్రాధాన్యంగా విద్య, చిన్నారుల సంక్షేమం
- 16 లక్షలమంది రైతులకు గ్రిడ్ అనుసంధానిత సోలార్ విద్యుత్ అందజేత
- జీరో బడ్జెట్ నేచురల్ ఫామింగ్కు ప్రభుత్వం చేయూత
- రైతులకు సహాయంగా గిడ్డంగుల నిర్మాణం
- ముద్ర స్కీమ్ ద్వారా గ్రామీణ మహిళలకు సాయం, అలాగే ధాన్యలక్ష్మి పేరుతో నూతన పథకం అమలు
- సాగర్ మిత్ర పథకం ద్వారా గ్రామీణ రైతులకు మత్స్య పెంపంకంలో చేయూత
- ఆరోగ్య రంగానికి రూ.69 వేల కోట్లు కేటాయింపు
- జల జీవన్ మిషన్ కు రూ.3.06 లక్షల కోట్లు
- స్వచ్ఛభారత్ మిషన్కు రూ.12,300 కోట్లు
- వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ.2.83 లక్షల కోట్లు
- పంచాయితీరాజ్కు రూ.1.23 లక్షల కోట్లు
- భారత్ లో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు స్టడీ ఇన్ ఇండియా(ఇండ్ శాట్) ప్రోగ్రాం
- విద్యారంగానికి రూ.99.300 కోట్లు
- యువతలో నైపుణ్యాభివృద్ధికి రూ.3,000 కోట్లు
- కొత్తగా మరో ఐదు స్మార్ట్ సిటీల అభివృద్ధి
- విద్యారంగంలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి ఇస్తూ నిర్ణయం
- చిన్న స్థాయి ఎగుమతిదారుల కోసం నిర్విక్ పథకం అమలు
- పరిశ్రమలు మరియు వాణిజ్య రంగానికి రూ.27,300 కోట్లు
- త్వరలో నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ ఏర్పాటు
- విద్యారంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి
- రైల్వేల్లో ప్రైవేటీకరణ పెంచుతాం, ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య పద్ధతిలో 150 రైళ్లు
- 2023 సంవత్సరం కల్లా ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వే పూర్తి
- 2024 కల్లా మరో 100 విమానాశ్రయాలు అభివృద్ధి
- నేషనల్ టెక్స్ట్ టైల్ మిషన్ కు రూ.1480 కోట్లు
- రవాణా మౌలిక సదుపాయాలకు రూ 1.7 లక్షల కోట్లు
- ఆడపిల్లల వివాహ వయస్సు పెంపుపై టాస్క్ఫోర్స్ ఏర్పాటు
- మహిళా సంక్షేమ పథకాల కోసం రూ.28,600 కోట్లు కేటాయింపు
- పౌష్టికాహార పథకానికి రూ.35.6 కోట్లు
- టూరిజం ప్రోత్సాహానికి రూ.2500 కోట్లు
- సాంస్కృతిక శాఖకు రూ.3150 కోట్లు
- సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి రూ.9500 కోట్లు
- ఎస్సిలకు, ఓబీసీలకు రూ.85 వేల కోట్లు కేటాయింపు
- బ్యాంకు డిపాజిట్లపై బీమా లక్ష నుంచి 5 లక్షలకు పెంపు
- జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి రూ.30,757 కోట్లు
- లద్దాఖ్ అభివృద్ధికి రూ.5958 కోట్లు
- 2020లో భారత్ లో జరిగే G-20 సమావేశాలకు రూ.100 కోట్లు
- కరెంటు బిల్లుల స్థానంలో స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు
- ఎల్ఐసీ లో వాటాల విక్రయం, స్టాక్ మార్కెట్ లోకి ఎల్ఐసీ
- కార్పొరేట్ ట్యాక్స్ 15శాతం తగ్గింపు
- వ్యక్తిగత ఆదాయపన్ను స్లాబుల్లో మార్పులు
- 2.50 లక్షల వరకు ఆదాయపన్ను విధింపు లేదు
- 2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం పన్ను
- రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు వార్షిక ఆదాయంపై 10 శాతం పన్ను (20 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు)
- రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పన్ను 15 శాతం పన్ను (20 నుంచి 15 శాతానికి తగ్గింపు)
- రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 20 శాతం పన్ను
- రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 25 శాతం పన్ను
- రూ.15 లక్షల పైబడి ఆదాయంపై 30 శాతం పన్ను
- లక్ష గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ
[subscribe]