కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం అండమాన్ అండ్ నికోబార్ దీవులకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా అండమాన్ అండ్ నికోబార్ లోని ఆర్మీ అండ్ నావీ కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ సందర్శించనున్నారు. కమాండ్ యొక్క కార్యాచరణ సంసిద్ధతను మరియు కమాండ్ అండ్ అవుట్లైయింగ్ యూనిట్ల యొక్క కార్యాచరణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని రాజ్ నాథ్ సింగ్ సమీక్షించనున్నారు. అలాగే క్యాంప్బెల్ బే, కార్నిక్ మరియు డిగ్లీపూర్లోని అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ యూనిట్లను కూడా సందర్శించనున్నారు. అక్కడ సైనికాధికారులతో, దళాలతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంభాషించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE