కుప్పంలో నా సొంత ప్రజలను కలుసుకోకుండా చేసేందుకే వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను తెచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఏపీలో రోడ్ షోలు, ర్యాలీలకు అనుమతి లేదని పేర్కొంటూ వైసీపీ ప్రభుత్వం జీవో నెం.1 తీసుకురావడంపై ఆయన ఫైర్ అయ్యారు. బుధవారం కుప్పంలో చోటుచేసుకున్న ఘటనలపై స్పందించిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కుప్పంలో ఏం జరుగుతుందో ప్రపంచంలోని తెలుగు వారంతా చూశారని, ప్రచార రథాల వాహనాలను సీజ్ చేసి భయబ్రాంతులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ప్రచార వాహనాలను తిరిగి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
రోడ్ షోలు రాష్ట్రానికి కొత్తా? అని ప్రశ్నించిన చంద్రబాబు నాయుడు గత 70 ఏళ్లలో ఎన్నో పాదయాత్రలు, రోడ్ షోలు జరిగాయని గుర్తుచేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, షర్మిల, జగన్ మోహన్ రెడ్డిలు చేసిన పాదయాత్రలకు అనుమతులిచ్చానని, ఇలాగే తాను కూడా అనుకుని ఉంటే వారు తిరగగలిగేవారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ పిరికితనంతో, ఓటమి భయంతో తప్పుడు కేసులు పెడుతున్నారని, పోలీసులు కూడా అధికార పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. కొందరు పోలీసుల తీరు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలా ఉందని, వారిపై ప్రైవేట్ కేసులు పెడతామని హెచ్చరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE