ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు భౌతికకాయానికి నివాళులర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తులసీరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం వారి స్వగ్రామం అనకాపల్లి జిల్లా యలమంచిలికి వెళ్లిన సీఎం జగన్, ఆడారి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా తులసీరావు విశాఖ డెయిరీకి చేసిన సేవలను సీఎం జగన్ స్మరించుకున్నారు. కాగా ఆడారి వెంకట రామయ్య, సీతయ్యమ్మ దంపతులకు ఫిబ్రవరి 1, 1939న జన్మించిన తులసీరావు, సుమారు 35 ఏళ్ల పాటు విశాఖ డెయిరీ చైర్మన్గా కొనసాగడం విశేషం. ఈ క్రమంలో సభ్యులైన పాడి రైతుల కోసం విశాఖ డెయిరీ తరుపున ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేశారు. ఇక ఆయన చైర్మన్గా ఉన్న కాలంలో విశాఖ డెయిరీ ఎంతో అభివృద్ధి చెందింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE