పోస్ట్-గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పీజీ పరీక్ష-2022 వాయిదా వేస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ముందుగా షెడ్యూల్ ప్రకారం మార్చి 12వ తేదీన నీట్ పీజీ పరీక్ష-2022 నిర్వహించాల్సి ఉండగా, తాజాగా 6-8 వారాల పాటుగా వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
నీట్ పీజీ 2021 కౌన్సెలింగ్ అదే సమయంలో జరుగుతుండడం, అలాగే చాలా మంది ఇంటర్న్లు మే/జూన్ 2022 నాటికి పీజీ కౌన్సెలింగ్-2022లో పాల్గొనలేరు కాబట్టి నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. త్వరలోనే పరీక్ష నిర్వహణ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఇంతకుముందే నీట్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ కొందరు ఎంబీబీఎస్ డాక్టర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నీట్ పీజీ పరీక్ష వాయిదాపై గురువారం నాడు సుప్రీంకోర్టులో కూడా విచారణ జరగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ