సమాజ్వాదీ పార్టీ అధినేత మరియు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్కు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘనంగా నివాళులర్పించారు. సోమవారం సాయంత్రం ములాయం స్వగ్రామమైన సైఫాయికి చేరుకున్న సీఎం యోగి ఆయన పార్థివ దేహంపై పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. ఈ క్రమంలో ములాయం తనయుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ను కలుసుకుని పరామర్శించారు. ఇక ములాయం సింగ్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో గురుగ్రామ్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. కాగా ములాయం సింగ్ యాదవ్ మృతికి నివాళిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సీఎం యోగి మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. అలాగే యూపీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహిస్తామని సీఎం యోగి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ములాయం సింగ్ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇటావా జిల్లాలోని అతని స్వగ్రామమైన సైఫాయ్లో జరుగుతాయని సమాజ్వాదీ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY