ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “కరోనా ప్రారంభ లక్షణాలు కన్పించిన అనంతరం పరీక్ష చేయించుకోగా ఫలితం పాజిటివ్ గా వచ్చింది. ప్రస్తుతం సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉన్నాను మరియు వైద్యుల సూచనలను పూర్తిగా పాటిస్తున్నాను. అలాగే అన్ని పనులను వర్చువల్ పద్ధతిలో సమీక్షిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలన్నీ మామూలుగానే జరుగుతున్నాయి. కాగా ఇటివల నాతో సంప్రదించిన వారందరూ పరీక్షించుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి” అని యోగి ఆదిత్యానాథ్ ట్వీట్ చేశారు.
ముందుగా తన కార్యాలయంలోని కొందరు అధికారులకు కరోనా వైరస్ పాజిటివ్ గా తేలిన అనంతం సీఎం యోగి ఆదిత్యానాథ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయనకు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ఈ రోజు తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ