ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వాహనంపై కాల్పులు జరిగటం కలకలం రేపుతోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కూడా కొన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో.. తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు అసదుద్దీన్ ఒవైసీ. దీనిలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న ఓవైసీ కాన్వాయ్పై ఛిజారసీ టోల్ గేట్ సమీపంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని దుండగులు తమ కాన్వాయ్పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు స్వయంగా వెల్లడించారు అసదుద్దీన్. కాల్పుల ఘటనలో తన కారు పంక్చర్ అయిందని.. తరువాత తాను వేరే కారులో వెళ్లానని తెలిపారు. కాగా, దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. అసదుద్దీన్ ఓవైసీ సైతం తనకు ఎవరిపై అనుమానాలు ఉన్నట్లు తెలుపలేదు.
कुछ देर पहले छिजारसी टोल गेट पर मेरी गाड़ी पर गोलियाँ चलाई गयी। 4 राउंड फ़ायर हुए। 3-4 लोग थे, सब के सब भाग गए और हथियार वहीं छोड़ गए। मेरी गाड़ी पंक्चर हो गयी, लेकिन मैं दूसरी गाड़ी में बैठ कर वहाँ से निकल गया। हम सब महफ़ूज़ हैं। अलहमदु’लिलाह। pic.twitter.com/Q55qJbYRih
— Asaduddin Owaisi (@asadowaisi) February 3, 2022
అయితే, అసదుద్దీన్ ఓవైసీ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. “కొద్దిసేపటి క్రితం ఛిజారసీ టోల్ గేట్ వద్ద నా కారుపై గన్ ఫైర్ చేశారు. 4 రౌండ్లు కాల్పులు జరిపారు. అక్కడ వారు ముగ్గురు, నలుగురు వరకు ఉన్నారు. కాల్పుల అనంతరం ఆయుధాలు అక్కడే వదిలేసి అందరూ పారిపోయారు. నా కారు పంక్చర్ అయింది.. కానీ నేను వేరే కారులో దిగి వెళ్లిపోయాను. అయితే, మేమంతా క్షేమంగా ఉన్నాం” అని ట్విట్టర్ లో తెలిపారు ఓవైసీ. మీరట్ నుంచి తిరిగి వస్తుండగా.. ఈ కాల్పుల ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ