దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే పలు పరీక్షలు రద్దు కాగా, మరికొన్ని వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష-2021 ను కూడా వాయిదా వేస్తునట్టుగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) గురువారం నాడు ప్రకటించింది. “కరోనా వైరస్ వలన ఏర్పడ్డ పరిస్థితుల కారణంగా, జూన్ 27, 2021న జరగాల్సిన సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష-2021 ను వాయిదా వేస్తున్నాం. కాగా ఆ పరీక్ష అక్టోబర్ 10, 2021న నిర్వహించబడుతుంది” అని యూపీఎస్సీ వెల్లడించింది.
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఏ), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) మరియు ఇతర సెంట్రల్ సర్వీసెస్ కోసం యూపీఎస్సీ ప్రతి సంవత్సరం ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు వంటి మూడు దశల్లో ఎంపిక నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ప్రిలిమ్స్ పరీక్ష-2021 జూన్ 27 న జరగాల్సి ఉండగా కరోనా కారణంగా అక్టోబర్ 10 కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ