ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మే 20వ తేదీ 9 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వర్చువల్ గా ప్రసంగించనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించనున్నారు, సభలో ఇతర ఏయే అంశాలను చర్చించనున్నారనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ