కరోనా మహమ్మారి వలన దేశంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ జీనా కూడా కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 50 సంవత్సరాలు. సురేంద్ర సింగ్ జీనా కి కరోనా పాజిటివ్ గా తేలిన అనంతరం చికిత్స నిమిత్తం కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలిపారు.
ఇటివలే సురేంద్ర సింగ్ జీనా భార్య సైతం గుండెపోటుతో కన్నుమూశారు. తాజాగా ఆయన మరణంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకుంది. అల్మోరా జిల్లాలోని స్టాల్ నియోజకవర్గం నుంచి సురేంద్ర సింగ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి ఆయన మూడుసార్లు విజయం సాధించారు. సురేంద్ర సింగ్ మృతి పట్ల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సహా పలువురు బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ