మంచి పాలన అందించేవారిని ప్రజలు ఎల్లప్పుడూ గెలిపిస్తారని ప్రధాని మోదీ తెలిపారు. ఉత్తరాఖండ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉత్తరాఖండ్లోని అల్మోరాలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అల్మోరాలో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘నిన్న యుపిలో మొదటి దశ పోలింగ్ తర్వాత, బిజెపి రికార్డు సంఖ్యలో విజయం సాధిస్తుందని స్పష్టమైంది. బీజేపీ నాయకుల కన్నా, కార్యకర్తల కన్నా ఎక్కువగా ప్రజలే బీజేపీ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావాలన్న కృతనిశ్చయంతో ఉన్నారని అర్ధమైంది. మంచి ఉద్దేశ్యంతో పాలన సాగించేవారిని ఓటర్లు ఎన్నటికీ వదిలిపెట్టరు. తిరిగి అధికారంలోకి తీసుకురావటానికి వారు తమ సంపూర్ణ మద్దతును తెలుపుతారు’ అని ప్రధాని మోదీ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ