భారతదేశంలో కరోనా వ్యాప్తిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ వినియోగాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అందులో భాగంగానే ఇప్పటి వరకూ 171.79కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో శుక్రవారం తాజాగా 58,077 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం సంఖ్య 4,25,36,137 కు చేరుకుందని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో క్రియాశీల కోవిడ్-19 కేసులు 6,97,802కి తగ్గాయి, ఇది దేశం మొత్తం పాజిటివ్ కేసుల్లో 1.64 శాతం.
అలాగే, భారతదేశం లోని పెద్దలందరికీ కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క మూడవ డోస్పై శాస్త్రీయ అవసరం ఆధారంగా నిర్ణయం తీసుకోబడుతుందని, ప్రస్తుతానికి ఇది ఇంకా పరిశీలనలో ఉందని ప్రభుత్వం తెలిపింది. విలేకరుల సమావేశంలో ఒక ప్రశ్నకు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి కె పాల్ సమాధానమిస్తూ.. ముందు జాగ్రత్త మోతాదులపై అన్ని నిర్ణయాలు అవసరాన్ని బట్టి తీసుకోబడతాయి అని వివరించారు. గడిచిన 24 గంటల్లో 48.18 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 97.17 శాతం కాగా వీక్లీ పాజిటివిటీ రేట్ 5.76 శాతంగా అధికారులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ