కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 19,675 కరోనా కేసులు, 142 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 45,59,601 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 24,039 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 19,702 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 43,73,966 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 1,61,026 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక త్రిస్సుర్ జిల్లాలో అత్యధికంగా 21956 యాక్టీవ్ కేసులు ఉండగా, ఎర్నాకులంలో 19689, కోజికోడ్ లో 18909, మలప్పురంలో 16488, తిరువనంతపురంలో 15891, అలపుజాలో 9967 కేసులు ఉన్నాయి. మరోవైపు ఆదివారం నాటికి కేరళలో 3,44,94,026 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ