భారత రెండవ అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి నామినేషన్ దాఖలు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో 16వ ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడానికి వచ్చే నెల 6న ఎన్నిక జరగనుంది. కాగా ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్ట్ 10వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 68శాతం ప్రకారం పదవీకాలం ముగిసేలోపు తదుపరి ఉపరాష్ట్రపతిని నియమించడానికి ఎన్నికలు నిర్వహించాలి. జూన్ 29న ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. జూలై 19 వరకు నామినేషన్లు దాఖలు ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 20న నామినేషన్ పత్రాల పరిశీలన జరుగనుంది. జూలై 22 వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం ఉంది. ఆగస్ట్ 6వ తేదీన ఎన్నిక జరుగుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ