కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటుగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. సబ్సీడి లేని ఎల్పీజీ సిలిండర్ (14.2 కేజీ) ధరను రూ.65 నుంచి రూ.61 వరకు తగ్గిస్తున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్ 1, బుధవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
తాజా తగ్గింపుతో ఇండేన్ పేరుతో అందించే ఇండియన్ ఆయిల్ సబ్సిడీయేతర ఎల్పీజీ రేట్లు ఢిల్లీలో రూ.744, ముంబైలో రూ.714.50, చెన్నైలో రూ.761.50, కోల్కతాలో రూ.774.50కు చేరుకున్నాయి. గత ఫిబ్రవరి 12 న సబ్సిడీయేతర వంట గ్యాస్ సిలిండర్ల ధరలను సిలిండర్కు రూ 144 నుంచి రూ.149 వరకు పెంచుతూ ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే గ్యాస్ మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడు సిలిండర్ ధరలు మళ్ళి తగ్గించడంతో వినియోగదారులకు కొంత ఊరట కలగనుంది.
[subscribe]